News July 24, 2024

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో 3 రోజులుగా పత్తి ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి ధర మంగళవారం రూ.7,180కి చేరింది. నేడు మరికొంత పెరిగి రూ.7,230 అయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తేమ లేని, నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకురావాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

Similar News

News February 18, 2026

అంగన్వాడీ సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వీడాలి: కలెక్టర్

image

అంగన్వాడీ సూపర్‌వైజర్లు పని తీరులో నిర్లక్ష్యం, లక్ష్యాలు సాధించడంలో వెనుకబడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొంతమంది సూపర్‌వైజర్లపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. CDPOలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, సేవల అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.

News February 18, 2026

రైతుల సాగు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

image

రైతుల పంటల సాగును ఏఈఓలు సందర్శించి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనురాధతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులతో ఫార్మర్ రిజస్టరీ, క్రాప్ బుకింగ్, యూరియా నిల్వలు, రైతుబీమాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈఓలు వారి పరిధిలోని గ్రామాలలో రైతుల రిజిస్టర్‌కు సంబంధించి ఐడి క్రియేట్ చేయాలన్నారు.

News February 18, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: WGL కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 12,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతుల్లో లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.