News September 4, 2024
వరద బాధితులను ఆదుకునేందుకు కడప పోలీసులు

రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న సంఘటనలూ చూస్తున్నాం. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లాకు చెందిన సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా బందోబస్తుకు తరలి వెళ్లారు. బాధితులను ఆదుకునేందుకు NDRF సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Similar News
News November 2, 2025
ప్రొద్దుటూరు: అక్టోబర్లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: గతనెలలో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.
News November 1, 2025
కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.


