News December 24, 2025

వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.

Similar News

News February 13, 2026

కాకాణి కుమార్తెకు నోటీసులు

image

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.

News February 13, 2026

నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

image

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 13, 2026

నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

image

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.