News December 24, 2025
వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి : కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ, ఆయా పంటలకు రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కలెక్టర్ చాంబర్లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయుటకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ మీటింగ్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు పంట రుణాల మంజూరుపై కమిటీ చర్చించింది.
Similar News
News December 24, 2025
99.21 % పల్స్ పోలియో వ్యాక్సిన్ నమోదు: DMHO

జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 99.21% మంది చిన్నారులకు చుక్కల మందు ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 0-5 సం.లలోపు చిన్నారులకు తొలిరోజు 2,83,173, 2వ రోజు 4,461, 3వ రోజు 4,628 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.
News December 24, 2025
నెల్లూరు: మరింత వేగంగా విజయవాడకు.!

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్కు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారిలో 280కి.మీ మేర మూడో ట్రాక్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. సరకు రవాణాతోపాటు హై స్పీడ్ రైళ్ల రాకపోకల కోసం కేంద్రం నాలుగో లైన్ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తోన్నట్లు సమాచారం. ఇది పూర్తి అయితే VJD-GDR మధ్య రవాణా సమయం మరింత తగ్గనుంది. కావలి, కోవూరు, నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల మీదుగా ఈ నిర్మాణం జరగనుంది.
News December 24, 2025
తిరుపతిలో స్కాం.. AEO సూసైడ్పై చర్చ

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో <<18647016>>స్కాం <<>>జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నాటి AEOపై క్రమశిక్షణా రాహిత్యం కేసు ఎందుకు నమోదైంది? రిటైరయ్యే కొన్ని రోజుల ముందే ఆయన సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. ఆయన రిటైర్మెంట్ ముందు కూడా ఆ కేసు ఎందుకు క్లియర్ కాలేదనేది నేటికి ప్రశ్నగా మిగిలింది.


