News January 5, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
Similar News
News February 15, 2026
శివరాత్రి.. ఈ తప్పులు చేయకండి!

మహాశివరాత్రి నాడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూజా ఫలం దక్కదని పండితులు అంటున్నారు. ‘తులసి ఆకులతో పూజ చేయొద్దు. శివుడికి బిల్వపత్రాలంటేనే ఇష్టం. లింగానికి పసుపు, కుంకుమ పూయొద్దు. విభూతి రాయాలి. శంఖం, రాగి పాత్రతో అభిషేకం చేయొద్దు. ఉపవాసం ఉన్న వాళ్లు మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. జాగరణ అంటే వినోదం, కాలక్షేపం కాదు.. ఓం నమశ్శివాయ మంత్రాన్ని స్మరించాలి’ అని చెబుతున్నారు.
News February 15, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 15, 2026
శివుడికి నేడు ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే..

మహాశివరాత్రి నాడు శివలింగానికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 11 పూలతో ఆయనను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని అంటున్నారు. ‘పంచాక్షరి మంత్రం జపిస్తూ పూలు సమర్పించాలి. ఇలా చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అపరాజిత జలాభిషేకంతో శివానుగ్రహం లభించి సకల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.


