News January 3, 2026

వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

image

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.

Similar News

News February 20, 2026

రేపు వేంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి శ్రేణుల పూజలు

image

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ మండలికి YCP నేతలు శ్రీవారి ఫొటోలను తేవడంపై కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. దేవుడికి అపచారం జరిగిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జూమ్ కాన్ఫరెన్సులో నిర్ణయించారు. రేపు వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అటు మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

News February 20, 2026

ట్రంప్ మాకు వద్దు బాబోయ్: భారతీయ అమెరికన్లు

image

ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది వ్యతిరేకంగా, 29% మంది సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇమిగ్రేషన్, దేశ ఆర్థిక వ్యవస్థ, ట్రేడ్, టారిఫ్స్ విషయంలో ట్రంప్ పాలసీలను 65% మందికిపైగా వ్యతిరేకించారు. భారతీయులపై విద్వేషం, భారత్‌తో బంధం సడలడం వంటి కారణాలతో అభిప్రాయం మారినట్లు తెలుస్తోంది.

News February 20, 2026

ఒమన్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

image

T20WC గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 105 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64*(7 ఫోర్లు, 4 సిక్సులు), హెడ్ 19 బంతుల్లో 32(6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు. ఈ గెలుపుతో గ్రూప్-Bలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.