News January 31, 2026

వరి కోత తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.

Similar News

News February 17, 2026

వంటింటి చిట్కాలు

image

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

News February 17, 2026

KCR బర్త్‌డే.. సాదాసీదాగా కవిత విషెస్

image

TG: మాజీ సీఎం, తన తండ్రి KCR పుట్టినరోజు సందర్భంగా కవిత ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఆమె సాదాసీదాగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పైనా ఆమె విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా KCRకు విషెస్ తెలిపారు.

News February 17, 2026

నా కూతురిని రేప్ చేసి చంపేశారు: ప్రత్యూష తల్లి

image

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు <<19164468>>తీర్పును<<>> గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజిని పేర్కొన్నారు. కానీ తనకు న్యాయం జరగలేదన్నారు. ‘నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారు. నిందితుడికి జీవిత ఖైదు వేయాలని పోరాటం చేశా. కేసు మొదట్లోనే సాక్ష్యాలను తారుమారు చేశారు. ప్రత్యూష శరీరంపై గాట్లు ఉన్నాయి. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిందని మునుస్వామి ఇచ్చిన రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు?’ అని ప్రశ్నించారు.