News March 10, 2025
వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.
Similar News
News February 11, 2026
అమెరికా ‘మ్యాప్’ మాయ.. PoK పోస్ట్పై యూటర్న్!

PoK, ఆక్సాయ్ చిన్తో కలిపి మొత్తం J&Kను <<19072627>>భారత భూభాగం<<>>గా చూపిస్తూ చేసిన SM పోస్ట్ను అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్ (USTR) తొలగించింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ గతవారం USTR ఈ మ్యాప్ను పోస్ట్ చేసింది. దీంతో పాక్, చైనా ఆక్రమణలను తిరస్కరిస్తూ ఇండియా పొలిటికల్ మ్యాప్ను అమెరికా అధికారికంగా గుర్తించినట్లు అంతా భావించారు.
News February 11, 2026
వనపర్తి : ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్కు ఏర్పాట్లు…!

వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నేడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 64,190 మంది ఓటర్లు, పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 14,333 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డులకు 18,192 మంది, అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు 9,147 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు 11,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News February 11, 2026
జనగామ: ఎన్నికల పర్యవేక్షణకు నిఘా బృందాలు ఇవే!

జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 102 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు పర్యవేక్షణ, నిఘా బృందాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 6, స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు 9, జోనల్ ఆఫీసర్స్ 9, రూట్ ఆఫీసర్స్ 9 మందిని నియమించారు. ఎన్నికల ప్రక్రియ విధులకు 375 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.


