News March 10, 2025
వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం SI కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. చాంద్ఖాన్ మక్తాకు చెందిన విజయేందర్ రెడ్డి(15) చౌదర్పల్లి పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. విజయేందర్ గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లగా ఎందుకు తిరుగుతున్నావని తల్లి కనకవ్వ మందలించింది. దీంతో మనస్తాపంతో పురుగు మందు తగగా చికిత్స పొందుతూ అదివారం మృతి చెందాడు.
Similar News
News January 6, 2026
చిత్తూరుకు పునర్విభజన ఎఫెక్ట్.. తగ్గిన గ్రామ పంచాయతీలు

చిత్తూరు జిల్లాకు పునర్విభజన పుణ్యమా అంటూ గ్రామ పంచాయతీలు తగ్గాయి. 696 గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా పునర్విభజన అనంతరం 75 గ్రామ పంచాయతీలు నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య మదనపల్లి జిల్లాలో కలిసిపోయాయి. దీంతో 621 గ్రామ పంచాయతీలకు చిత్తూరు జిల్లా పరిమితమైంది. ఇక మండలాల వారీగా పుంగునూరు, చౌడేపల్లి, సదుం మండలాలు మదనపల్లిలో కలవడంతో 32 ఉన్న మండలాలు 28 కి మాత్రమే పరిమితమైంది. దీంతో చిత్తూరు చిన్నదైంది.
News January 6, 2026
కల్లూరు: హోదా పెరిగినా.. వృత్తిని వదలని సర్పంచ్

పదవి వచ్చినా పాత వృత్తిని వదలక ఆదర్శంగా నిలుస్తున్నారు కల్లూరు మండలం తెలగవరం సర్పంచ్ యల్లమందల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘ సభ్యురాలైన ఆమె, కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కారం, పిండి మిల్లు నడుపుతున్నారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత కూడా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, తన వృత్తిని కొనసాగిస్తూనే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. శ్రమను నమ్ముకున్న ఆమె తీరును చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.
News January 6, 2026
పిల్లలకు బోటులిజం వస్తే ఏమవుతుందంటే?

ఇంఫాంట్ బోటులిజంలో పిల్లల కండరాలు బలహీనపడతాయి. చూపు మందగించడం, అలసట, నీరసం, సరిగ్గా ఏడవలేకపోవడం, పీల్చడం, మింగడంలో ఇబ్బందులు పడతారు. శ్వాస తీసుకోవడంలో కూడా కష్టం కలగవచ్చు. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా తేనెలో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, పిల్లలకు అది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.


