News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News February 20, 2026
జగిత్యాల: ‘సేవాలాల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం’

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది, గిరిజన నాయకులు ఉన్నారు.
News February 20, 2026
విజయవాడ: ఈ పిల్లలు ఎవరో తెలిస్తే చెప్పండి..!

NTR జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం నలుగురు చిన్నారులు వసతి పొందుతున్నారు. గత దసరా ఉత్సవాల సమయంలో తప్పిపోయిన వీరు పోలీసులకు దొరకగా, వారిని CWC ముందు హాజరుపరిచి ఆశ్రయం కల్పించారు. ఫోటోలో ఉన్న ఈ చిన్నారుల తల్లిదండ్రులు లేదా బంధువుల వివరాలు తెలిసిన వారు వెంటనే శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి, ఆధారాలు చూపి పిల్లలను తీసుకెళ్లాలని అధికారులు కోరుతున్నారు.
News February 20, 2026
శనగల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి: JC

జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలంలోని రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనగ కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతులు శనగ పంటను బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలుపై అధికారులు వివరించారు


