News February 3, 2025

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కు మాతృవియోగం

image

వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ తల్లి వెంకటమ్మ మృతి చెందారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో మృతి చెందగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

News February 3, 2025

ఉప్పరపల్లి: గీత కార్మికుడికి తీవ్రగాయాలు

image

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మండ నరేందర్ గౌడ్ తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. తలకు, నడుముకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

News February 3, 2025

వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. తరలివచ్చిన పత్తి 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం తాము ఊహించిన విధంగా రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. 15 రోజుల క్రితం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,000 పలికినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు.