News October 26, 2025
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్ష వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది అధికారులను టెలికాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరాదన్నారు. దీనికోసం ముందుగా గ్రామాల్లో దండోరా, మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, జిల్లా అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా అమలు చేయాలన్నారు.
Similar News
News October 26, 2025
అల్వాల్లో యాక్సిడెంట్.. మహిళ మృతి

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న దంపతులను వెనకనుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష అక్కడిక్కడే మృతి చెందింది. భర్తకు గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు కరీంనగర్కు చెందిన ఎలక్ట్రిక్ బస్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
News October 26, 2025
చంచల్గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.


