News March 20, 2024

వలస కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు

image

చర్ల మండలంలోని దోసిల్లపల్లి గ్రామ మూలమలుపు వద్ద బుధవారం అదుపుతప్పి వలస కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం చింతల్ నార్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

Similar News

News February 17, 2026

ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.

News February 17, 2026

సన్న వడ్ల బోనస్ జమ: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64,093 మంది రైతులకు మొత్తం రూ.175.69 కోట్లు బోనస్‌గా అందజేశామని వెల్లడించారు. మద్దతు ధరతో పాటు ఈ అదనపు బోనస్ చెల్లింపు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

News February 17, 2026

GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

image

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.