News March 20, 2025

వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

image

పాలకుర్తి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. 2024 మే 17 నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, 308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 21, 2025

HYD: TG ఖోఖో జట్టు.. మనోళ్లు వీళ్లే !!

image

దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ ఖోఖో జట్టుకు కే.స్వాతి ప్రియాంక (PD,గోల్కొండ-HYD), కే.లీల (PD, బోయిన్ పల్లి-HYD), కే.కవిత (PD,పుట్ట పడ్-VKB) ఎంపికయ్యారు. దీంతో వీరిని ఎమ్మెల్యేలు, నేతలు, ఆయా పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు.

News March 21, 2025

చాహల్-ధనశ్రీ విడాకులు.. అప్పటి నుంచే దూరం!

image

చాహల్ – ధనశ్రీ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేయగా, రూ.4.75కోట్ల భరణం చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. కాగా 2020 డిసెంబర్‌లో వీరికి పెళ్లవగా, ఏడాదిన్నరకే (2022 జూన్) సపరేట్ అయినట్లు విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధనశ్రీ ఫేమ్ కోసం చాహల్‌ను వాడుకున్నారని కొందరు అంటుండగా, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

News March 21, 2025

 వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఓ యువకుడు ఉద్యోగం సాధించి మొదటి రోజు విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధారూర్ మండలం కేరేల్లి గ్రామానికి చెందిన నవీన్(26) నిన్న ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా కోకపేట టీగ్రీల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై నర్సింగ్ పోలీసుకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!