News February 24, 2025

వల్లభనేని వంశీ కేసులో కీలక అప్డేట్

image

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం మూడు రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్ట్రన్ టాయిలెట్స్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News November 9, 2025

పల్నాడులో చికెన్ ధరలు ఇవే..!

image

పల్నాడులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ ధర రూ.200 నుంచి రూ.230, స్కిన్‌తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.108గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.600గా ఉంది. మటన్ కేజీ రూ.800 నుంచి 900కి విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 9, 2025

కృష్ణా: ఆ ప్రాజెక్టులు వస్తే తిరుగేలేదు.. సాధ్యమయ్యేనా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 ప్రాజెక్టులపై సందిగ్ధత నెలకొంది. HYD-VJA, MTM-VJA 6 లైన్ల హైవేల DPRలలో మార్పులు చేయాలని నేతలు, కలెక్టర్లు NH అధికారులకు సూచించారు. మహానాడు జంక్షన్-నిడమానూరు ఫ్లైఓవర్ నిర్మాణం నిర్ణయం NH అధికారులు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే VJA రూపురేఖలు మారిపోతాయని MP చిన్ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నేతలు ఢిల్లీలో NH అధికారులను కలుస్తామని తెలిపారు.

News November 9, 2025

గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

image

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.