News August 20, 2025

వాగుల వద్ద సెల్ఫీల కోసం వెళ్లొద్దు: ఎస్పీ

image

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

Similar News

News August 20, 2025

ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే: రేవంత్

image

TG: ప్రపంచస్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్థాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించినా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని నొక్కి చెప్పారు.

News August 20, 2025

హాస్య నటుడు పద్మనాభం మన కడప జిల్లా వాసే.!

image

హాస్యనటుడు పద్మనాభం మన కడప జిల్లా వాసి అన్న విషయం మీకు తెలుసా? అవును నిజమే ఆయన కడప జిల్లా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పంచిన ఆయన మద్రాసులో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు రైలులో కొండాపురం వచ్చేవారు. అక్కడి నుంచి సింహాద్రిపురం బస్సులో వెళ్లేవారు. పులివెందుల, కడప నగరాలకు పనుల మీద ఎక్కువగా వస్తుండేవారు. సింహాద్రిపురంలో వారికి ఇల్లు కూడా ఉంది. కాగా నేడు ఆయన జయంతి.

News August 20, 2025

ఢిల్లీ సీఎంపై దాడికి కారణమిదేనా?

image

ఢిల్లీ CM రేఖా గుప్తాపై రాజేశ్ <<17460103>>దాడికి<<>> పాల్పడిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన నిందితుడు శునక ప్రేమికుడని, సుప్రీంకోర్టు <<17368812>>తీర్పుతో<<>> కలత చెంది ఢిల్లీకి వెళ్లాడని అతడి తల్లి పేర్కొంది. ఇదే విషయమై CMను ప్రశ్నించేందుకు వెళ్లి దాడి చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిది హింసా ప్రవృత్తి అని, మానసిక పరిస్థితి బాగాలేదని అతడి తల్లి తెలిపారు. తనతో సహా పొరుగువారినీ కొట్టేవాడని వివరించారు.