News February 16, 2025

వాజేడు: విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల రోదన  

image

జ్వరంతో విద్యార్థి మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వినీత్(14) మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో విద్యార్థిని 2రోజులు సెలవులకు హాస్టల్ సిబ్బంది ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం రావడంతో ఏటూరునాగారం తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.   

Similar News

News September 19, 2025

నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

image

AP: మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ ‘చలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు YCP ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

News September 19, 2025

వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

image

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.

News September 19, 2025

VKB: ‘మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి’

image

నిరుపేద మహిళలను మహిళా సంఘాల్లో 100% చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్‌తో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా పయనించాలన్నారు.