News December 29, 2024

వాటిపై 31వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్ ప్రశాంతి

image

షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్‌లో డిజిటలైజ్ చేస్తారని, తహశీల్దార్ ద్వారా తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

వార్డెన్‌లు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తూ.గో. జిల్లాలోని వసతి గృహాల వార్డెన్‌లు పిల్లల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం స్పష్టం చేశారు. రాజమండ్రిలో బుధవారం ఆమె మాట్లాడారు. పిల్లలను పంపించేటప్పుడు, వారి సంరక్షణకు భద్రతా నిబంధనలు పాటిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు నమోదు చేసుకున్న తర్వాతే వారిని పంపించాలని ఆమె ఆదేశించారు.

News October 22, 2025

స్త్రీ శక్తి పథకం మరింత ముందుకు తీసుకువెళ్లాలి: DPTO

image

‘స్త్రీ శక్తి’ పథకం మరింత ముందుకు సాగేందుకు ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల యజమానులు సహకరించాలని డీపీటీఓ వైఎస్‌ఎన్‌ మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కార్యాలయంలో డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పథకం విజయానికి ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చాలని సూచించారు.

News October 22, 2025

96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు: కలెక్టర్

image

ఈ నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. 5 నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరుగుతుందన్నారు. ఆధార్ రికార్డులు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు, పథకాలు, విద్యా అవకాశాలను పొందగలుగుతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.