News March 3, 2025
వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు: విశాఖ డీఈవో

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు మార్చి 3వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. 9552300009 నంబర్కు హాయ్ అని పంపిస్తే దాని ద్వారా వాట్సాప్ సేవలు > విద్యా సేవలు > SSC హాల్ టికెట్ > అప్లికేషన్ నంబర్ > చైల్డ్ ఐడీ, పుట్టిన తేదీ > స్ట్రీమ్ > కన్ఫర్మ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
Similar News
News March 4, 2025
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా అభ్యంతరాల స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీ లోపు తన కార్యాలయంలో అభ్యంతరాల వివరాలు నమోదు చేసి అందజేయాలన్నారు.10వ తేదీ తర్వాత అభ్యంతరాలు స్వీకరించమన్నారు.
News March 3, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు
➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు
➤ రుషికొండ బ్లూ ఫ్లాగ్ ఇష్యూ పై జేసీ సమీక్ష
➤ వాట్సాప్లో పదో తరగతి హాల్ టికెట్లు
➤ ఈ నెల 6న ఒకే వేదికపై దగ్గుపాటి పురంధేశ్వరి, చంద్రబాబు
➤ ఈ నెల 4వ తేదీ నుంచి అసంఘటిత కార్మికులు ధర్నా
➤ ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు
News March 3, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు నాయుడు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీనివాసుల నాయుడు 710 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి రోజు నుంచి ముగ్గురు మధ్య పోటీ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రతి రౌండ్లో శ్రీనివాసులు నాయుడు కొంతమేరకు ఆదిక్యం కనపరుస్తూనే వచ్చారు. చివరకు ఎలిమినేషన్ రౌండ్-2 ప్రాధాన్యత ఓట్లు లెక్కింపులో శ్రీనివాసులు నాయుడు గెలుపొందినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.