News January 23, 2025
వారంతా పేర్లు నమోదు చేసుకోండి: కలెక్టర్

గృహాల సర్వేలో మిగిలిపోయిన వారంతా సచివాలయాలలో తక్షణమే తమ పేర్లు నమోదు చేయించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గృహం జియో ట్యాగ్ చేపించుకోవాలని ఆయన సూచించారు. ఆధార్ కార్డులు లేని వారు తక్షణమే ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News February 23, 2026
నేడు గుంటూరు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 23, 2026
నేడు గుంటూరు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 22, 2026
గుంటూరు: బ్యాంకులో నగలు మాయం..!

తుళ్లూరు(M) వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంక్లో బంగారు నగలు మాయమయ్యాయి. ఎస్సై కలగయ్య కథనం మేరకు.. ఈనెల 2న సేఫ్ లాకర్లో ఉంచిన 2 పౌచ్లలోని 328 గ్రాముల నగలు కనిపించడం లేదు. ప్రాథమిక అంతర్గత తనిఖీ, CCTV పరిశీలనలో అదే బ్రాంచ్కు చెందిన ఉద్యోగి సంధ్యారాణి అనుమతి లేకుండా తాళం చెవి తీసుకుని లాకర్ నుంచి పౌచ్లు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.


