News December 8, 2025
‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News April 4, 2026
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.
News April 4, 2026
రేపే ఉప్పల్లో మ్యాచ్.. వీటిపై నిషేధం

రేపు 3.30PMకు ఉప్పల్లో SRH, LSG తలపడనున్నాయి. స్టేడియం వద్ద క్లాక్రూమ్ ఉండదని, నిషేధిత వస్తువులు తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
వీటిపై నిషేధం: ల్యాప్టాప్లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ పాడ్స్, కీ చైన్లు, పెన్నులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు.
News April 4, 2026
ప్రభాస్ ‘ఫౌజీ’ ఫొటోలు లీక్.. మేకర్స్ వార్నింగ్

హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్కు సంబంధించి లీకైన కొన్ని ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కంటెంట్పై రిపోర్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేయొద్దని సూచించారు. ఇలాంటి లీకుల వల్ల సినిమా నిర్మాణంపై ప్రభావం పడుతుందన్నారు. సిల్వర్ స్క్రీన్పై మూవీని చూస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు.


