News September 21, 2025
వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు గిరిజన వారపు సంతల్లో శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. సంతలకు వచ్చే ప్రజల ఆరోగ్య అవసరాల మేరకు రక్త పరీక్షలను నిర్వహించాలని అన్నారు. రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అయితే వారికి ఉచిత వైద్యంతో పాటు మందులను సరఫరా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 21, 2025
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

మందస మండలం కొర్రాయిగేట్ సమీపంలో NH16 రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని శ్రీకాకుళం RIMS హాస్పిటల్లో మార్చురీ గది వద్ద ఆచూకీ కోసం ఉంచారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు మందస స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
News September 21, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News September 21, 2025
పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

కరీంనగర్లో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. బొమ్మకల్ రోడ్డులో ఉన్న సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బిహార్కు చెందిన బిట్టు కుమార్-సుధాదేవి కుమారులు సత్యం కుమార్, ఆర్యన్ కుమార్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పైపులు కూలింగ్ చేసే ట్యాంకులో పడిపోయారు. గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.