News October 21, 2025
వారితో అప్రమత్తంగా ఉండండి: ఏసీపీ దామోదర్

విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ప్రజలకు ముఖ్య సూచన చేశారు. పని మనుషులు, కేర్ టేకర్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరారు. ఇటీవల కన్సల్టెన్సీల ద్వారా వచ్చే సిబ్బంది నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అనుమానాలు ఉంటే తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News October 21, 2025
స్పామ్ మెసేజ్ల నియంత్రణకు వాట్సాప్లో కొత్త ఫీచర్!

స్పామ్ మెసేజ్ల నియంత్రణకు WhatsApp ఓ ఫీచర్ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్నోన్ నంబర్లకు పంపే బ్రాడ్కాస్ట్ మెసేజ్లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్లో నిర్దేశించిన లిమిట్కి చేరగానే మళ్లీ మెసేజ్లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది.
News October 21, 2025
KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.
News October 21, 2025
KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.