News March 25, 2025
వారి వలలో పడకండి: అన్నమయ్య ఎస్పీ

నకిలీ రుణ మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇవి ఆన్లైన్లో జరుగుతున్నాయని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. రుణం కావాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలని అడుగుతారు. రుణం మంజూరుకు ముందు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారని చెప్పారు.
Similar News
News February 25, 2026
ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: హైకోర్టులో హరీశ్ తరఫు లాయర్

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని BRS చీఫ్ KCR, హరీశ్ రావు, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. PC ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని హరీశ్ తరఫు న్యాయవాది సుందరం కోర్టుకు నివేదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఘోష్ నివేదిక చెల్లదని విన్నవించారు. కాగా విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. KCR తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు.
News February 25, 2026
రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: పొంగులేటి

రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న MRO, RDO కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 60 MRO, 5 RDO కార్యాలయాలకు, రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాలకు ఆధునిక భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు పారదర్శకమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 25, 2026
తిరుచ్చిపై విహరించిన శ్రీ కృష్ణస్వామి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణస్వామివారు బుధవారం రాత్రి బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి తిరుచ్చి పై నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.


