News March 1, 2025

వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రోకు రూ.50కోట్లు

image

వార్షిక బడ్జెట్‌లో విజయవాడ మెట్రో నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించింది. కాగా మెట్రో పూర్తిచేసేందుకు కేంద్రం 100% భరించేలా గతంలో రాష్ట్రం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనపై కేంద్రం అధికారిక ప్రకటన ఇచ్చినట్లయితే రాష్ట్రం నుంచి మరిన్ని నిధుల కేటాయింపుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం విజయవాడ మెట్రోపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.   

Similar News

News March 1, 2025

భీమిని: కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు, బంధువులు దాడికి యత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేశారు.

News March 1, 2025

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్‌లో గట్టి పోటీ

image

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.

News March 1, 2025

టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

image

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.

error: Content is protected !!