News February 1, 2026
వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి: కలెక్టర్

కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం విలేకరులకు కీలక సూచనలు చేశారు. స్థానిక కమ్మ జన సేవా సమితి కళ్యాణ మండపంలో జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వార్తలను ప్రచురించాలని కోరారు.
Similar News
News February 21, 2026
మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
News February 21, 2026
ALERT: మూడ్రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 21, 2026
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.


