News August 20, 2025
వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిలో కోట్లు స్వాహా?

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సుమారు 2-3 లక్షల మంది వస్తారు. ప్రసాద భవనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చివేయడం వల్ల కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Similar News
News August 20, 2025
ICC ర్యాంకింగ్స్లోకి తిరిగొచ్చిన రోహిత్, కోహ్లీ!

టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటర్ల <<17464301>>ర్యాంకింగ్<<>> లిస్టులోకి తిరిగొచ్చారు. ఇవాళ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో వారి పేర్లు మిస్ అయ్యాయి. దీంతో అటు క్రీడా వర్గాల్లో, ఇటు అభిమానుల్లో ఏం జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది. తాజాగా ICC టెక్నికల్ గ్లిచ్ను సరిచేయడంతో రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. కాగా ఈ లిస్టులో గిల్ 1, శ్రేయస్ 8వ ర్యాంకులో ఉన్నారు.
News August 20, 2025
పురానాపూల్: పాఠశాలను సందర్శించిన కలెక్టర్

పురానాపూల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్థానిక పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఈరోజు సందర్శించారు. డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటూనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
News August 20, 2025
సిరిసిల్ల: ’22న ఉపాధి హామీ పథకం పనుల జాతర’

జిల్లాలోని 260 గ్రామాల్లో ఈనెల 22న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర నిర్వహించనున్నట్టు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా క్రింద పశువుల కొట్టం, కోళ్ల షెడ్, గొర్రెల షెడ్, పండ్లతోటలు, వాన పాముల ఎరువుల తయారీ, అజోలాఫిట్ నిర్మాణం వంటి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని వివరించారు.