News January 15, 2026
వాహనదారులారా.. గాలిపటం దారంతో జాగ్రత్త

మధురవాడ బ్రిడ్జి వద్ద గాలిపటం దారం తగిలి విశ్రాంత సైనిక ఉద్యోగి సీహెచ్ వెంకట్రావు(54)కి గాయాలయ్యాయి.
కొమ్మాది నుంచి ఎంవీపీ కాలనీకి ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళుతుండగా ఫ్లై ఓవర్ దగ్గరకు వచ్చేసరికి గాలిపటం దారం తగిలింది. పెదవుల వద్ద తెగడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
**పతంగుల దారాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. చైనా మాంజా తగిలి ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి.
Similar News
News February 21, 2026
మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.
News February 21, 2026
స్వచ్ఛ కార్యక్రమంలో కాకినాడ జేసీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆంధ్ర దిశగా అడుగులేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. 3వ శనివారం సందర్భంగా రూరల్ వాకలపూడిలో ఆయన అధికారులతో కలిసి చీపుర్లు చేత బట్టి డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రతిజ్ఞ చేయించారు. జేసీ తమ ఎదుట పరిసరాలు పరిశుభ్రం చేయడంతో ఉద్యోగులు, సిబ్బందే కాదు ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.
News February 21, 2026
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఇంటర్ బోర్డు

AP: ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉ.9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు.


