News January 15, 2026
వాహనదారులారా.. గాలిపటం దారంతో జాగ్రత్త

మధురవాడ బ్రిడ్జి వద్ద గాలిపటం దారం తగిలి విశ్రాంత సైనిక ఉద్యోగి సీహెచ్ వెంకట్రావు(54)కి గాయాలయ్యాయి.
కొమ్మాది నుంచి ఎంవీపీ కాలనీకి ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళుతుండగా ఫ్లై ఓవర్ దగ్గరకు వచ్చేసరికి గాలిపటం దారం తగిలింది. పెదవుల వద్ద తెగడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
**పతంగుల దారాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. చైనా మాంజా తగిలి ప్రాణాలు పోయిన ఘటనలూ ఉన్నాయి.
Similar News
News March 7, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కీర్తి చేకూరి

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.
News March 7, 2026
ధర్మపురి: నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు

బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నపూర్లో హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధమ్మ తిరుపతిని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారాం బస్టాండ్ వద్ద కులం పేరుతో దూషించి కొట్టాడు. గట్టు గణేశ్ బంధువు గట్టు శ్రవణ్లతో కలిసి తిరుపతిపై దాడి చేశారు. కేసులో BNS సెక్షన్లు, SC/ST చట్టం కింద కేసు నమోదు చేసి, అదనంగా 109(1) సెక్షన్ చేర్చినట్లు సీఐ రామ్ నరసింహ రెడ్డి తెలిపారు.
News March 7, 2026
వామ్మో ఎండలు.. 40 డిగ్రీలు దాటేసిన టెంపరేచర్!

TG: మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా) నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.


