News February 26, 2025
వికారాబాద్లో మంగళవారం నాటి ముఖ్యాంశాలు

✓వికారాబాద్: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్. ✓లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్. ✓బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య. ✓పరిగి: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు. ✓మహా కుంభమేళాలో ప్రభుత్వ చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ. ✓తాండూర్: శరవేగంగా రైల్వేస్టేషన్లో సుందరీకరణ: జీఎం అరుణ్ కుమార్ జైన్. ✓కొడంగల్: మహాశివరాత్రికి ముస్తాబైన శివాలయాలు.
Similar News
News November 13, 2025
విడాకుల తర్వాత భయాందోళనలకు గురయ్యా: సానియా

షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత తాను భయాందోళనలకు గురైనట్లు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా చెప్పారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు అండగా నిలిచారని ఓ టాక్ షోలో తెలిపారు. కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్తో సానియా 2023లో విడిపోయారు.
News November 13, 2025
నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.
News November 13, 2025
సముద్రతీరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని పరిశవారిపాలెం సముద్ర తీరం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించామన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


