News November 6, 2025
వికారాబాద్లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం, ఆస్తి వివాదాలు, లోన్ మోసాలు, కుటుంబ సమస్యలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News March 9, 2026
ADB: ఎత్తిపోతలు.. ఉత్తిదేనా?

రూ.కోట్లతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, పెద్దవాగులపై గత ప్రభుత్వాలు 72 పథకాలను మంజూరు చేశాయి. కాగా ASF జిల్లాలో 14కి 2, ADBలో 27కి 9 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. NRMLలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేస్తే ఈ లిఫ్టుల మరమ్మతులు పూర్తయి దాదాపు 27 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుందని రైతులు చెబుతున్నారు.
News March 9, 2026
TU: పీజీ పరీక్షలు.. 30 మంది గైర్హాజరు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీజీ, ఇంటిగ్రేటెడ్ ఫీజు మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 4 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 529 మంది విద్యార్థులకు 499 మంది హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.


