News March 29, 2025

వికారాబాద్: అగ్నివీర్‌కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

image

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని మదనంతాపూర్ గ్రామానికి చెందిన అరవింద్, మంబాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమారులు అగ్నివీర్ కు ఎంపికయ్యారు. మండలం నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే కావడం గమనార్హం.

Similar News

News February 26, 2026

తీర్థం ఎలా తీసుకోవాలి?

image

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.

News February 26, 2026

364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 364 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ, బీటెక్, డిగ్రీ(BA, BCom, BBA, LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News February 26, 2026

HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

image

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.