News February 1, 2025
వికారాబాద్: అడవిలో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెడితే చర్యలు

అటవీ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నిప్పు పెడితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ రేంజర్ అధికారి రాజేందర్ హెచ్చరించారు.శుక్రవారం అర్ధరాత్రి యాలాల్ మండలం రాస్నం-అంపల్లి మార్గంలో గల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సెక్షన్ అధికారి కనకరాజు తన సిబ్బందితో వెళ్లి మంటలు ఆర్పారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగితే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Similar News
News February 24, 2026
మాలలో పార్టీకి వెళ్లిన చరణ్పై విమర్శలు.. శిరీష్ క్లారిటీ!

హీరో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందించారు. ‘చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అప్పటికి అక్కడ ఎవరూ లేరు. పార్టీ కూడా మొదలుకాలేదు. ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన మమ్మల్ని విష్ చేసి ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని తెలిపారు. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.
News February 24, 2026
చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.
News February 24, 2026
సిద్దిపేట: టెన్త్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిఘా ఉంచాలన్నారు.


