News February 26, 2025

వికారాబాద్: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,439మంది స్టూడెంట్స్ 

image

మార్చ్ 5 నుంచి కొనసాగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు 29 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16,439 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం- 7,914 మంది, సెకెండ్ ఇయర్ 6,963 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.

Similar News

News February 26, 2025

జపాన్ సకురాకు సంగారెడ్డి ప్రాజెక్టు.. కలెక్టర్ అభినందనలు

image

జపాన్ సుకూరాకు ఎంపికైన ఆందోల్ మండలం కన్‌సాన్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి స్రవంతి, గైడ్ ఉపాధ్యాయుడు సిద్ధేశ్వరని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సన్మానించారు. విద్యార్థిని తయారు చేసిన డిస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జపాన్ వెళ్లి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News February 26, 2025

KMR: పది పరీక్షలు..ఎంత మంది రాయనున్నారంటే..?

image

పది పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసే పనిలో ఉంది. KMR జిల్లాలో పది వార్షిక పరీక్షలు 12,579 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందు కోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు..ఐదుగురు రూట్, 22 మంది కస్టోడియన్స్, 22 జాయింట్ కస్టోడియన్స్, 11 మంది సీ సెంటర్ కస్టోడియన్స్, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్, 12 సిట్టింగ్ స్క్వార్డ్, 698 మంది ఇన్విజిలేటర్లను నియమించింది.

News February 26, 2025

ఆత్మహత్యల ‘కోటా’.. అడ్డుకట్టకు చర్యలు!

image

రాజస్థాన్‌లోని కోటాలో ఎన్ని చర్యలు చేపట్టినా విద్యార్థుల ఆత్మహత్యలకు <<14028051>>అడ్డుకట్ట<<>> పడటంలేదు. స్థానిక అధికారులు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో హాస్టల్ యజమానులు ఏడాది మొత్తం ఫీజును ఒకేసారి వసూలు చేసేవారు. ఇకపై తొలుత రూ.2వేలు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పార్క్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.

error: Content is protected !!