News November 11, 2025

వికారాబాద్: కల్లు దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా.?

image

వికారాబాద్ జిల్లాలో కల్లు దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సమావేశం ఏర్పాటు చేసి SHOలు షాపు యజమానులకు సూచించారు. అయితే ఇప్పటి వరకు పలు దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయారు. SP ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News November 11, 2025

చక్కటి కురులకు చక్కెర స్నానం

image

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

News November 11, 2025

TTDకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా

image

తిరుమలకు రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 2022-24 మధ్య భోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు A16 అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్‌లో CBI SIT పొందుపరిచింది. ఇందులో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా తరలించారని సిట్ పేర్కొంది.

News November 11, 2025

తుళ్లూరు: కారుణ్య మరణం పిటిషన్‌పై హైకోర్టు సీరియస్

image

తమ భూమిని తిరిగి అప్పగించకలేకపోతే కారుణ్య మరణానికి అనుమతించాలని తుళ్ళూరు(M) రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె, మనవరాలు పిటిషన్‌ వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ తరహా అభ్యర్థనలు అనుమతించబోమని తెలుసు కదా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై ఆగ్రహించింది. ప్రచారం కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దంది. కాగా CRDAకు అప్పగించిన తమ 5 సెంట్ల భూమిని అప్పగించాలని వారు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.