News April 1, 2025
‘వికారాబాద్ జిల్లాలో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవాలి’

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతను దరఖాస్తులకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Similar News
News February 23, 2026
త్వరలో రాష్ట్రానికి మరో 1085 ఎలక్ట్రిక్ బస్సులు

TG: రాష్ట్రంలో మరో 1,085 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ₹1800కోట్లకు TGSRTC ఈ బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 1025 నాన్ ఏసీ బస్సులు కాగా 60 ఏసీ బస్సులు ఉన్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఒలెక్ట్రా గ్రీన్టెక్ ద్వారా ఎవే సంస్థ ఈ బస్సులను మరో 20నెలల్లో డెలివరీ చేయనుంది.
News February 23, 2026
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు తనికి చేస్తూ ఉండాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్నందున విద్యార్థులకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
News February 23, 2026
జగిత్యాల: సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశం

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్ఎస్సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్హెచ్-63, ఎన్హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.


