News March 15, 2026
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం

కొడంగల్ మండలం రావులపల్లికి చెందిన రామ్ రెడ్డి (62) ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకొని మృతి చెందాడు. ఆదివారం పొలం గట్టుపై ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గుండెపోటుకు గురై అదే మంటల్లో పడి మృతి చెందినట్లు బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
కొండవీడు కోటపై ‘నైట్ క్యాంపింగ్’.. ప్రకృతి ఒడిలో రాత్రి బస!

పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడు కోటపై పర్యాటకుల కోసం అటవీశాఖ నైట్ టెంట్ క్యాంపింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో రాత్రి బసతో పాటు మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్, సూర్యోదయ వీక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ధర పెద్దలకు రూ. 2,000, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ. 1,000గా నిర్ణయించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2026
చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్బాతేనా?

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్లో ట్రెండ్ అవుతున్నాయి.


