News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో పెరిగిన యాసంగి సాగు

image

జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలర పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు.

Similar News

News March 3, 2026

నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

image

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.

News March 2, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం

News March 2, 2026

కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ MP DK అరుణ ఎమ్మెల్యే దీక్షను విరమింపజేశారు.