News February 7, 2025
వికారాబాద్ జిల్లాలో 70,219 మందికి రైతు భరోసా
రెండో రోజుల్లో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 70,219 మంది రైతుల ఖాతాలో రూ.32,99,94,264 కోట్లు జమయ్యాయని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలో డబ్బులు జమవుతాయన్నారు.
Similar News
News February 7, 2025
ఢిల్లీ దంగల్: AAP, BJP పోటాపోటీ మీటింగ్స్
ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో రాజకీయ వాతావరణం సీరియస్గా మారింది. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడిన రెండు ప్రధాన పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. BJP ఎరవేస్తోందంటూ ఆరోపించిన ఆప్ 70 మంది అభ్యర్థులను పార్టీ ఆఫీస్కు పిలిపించింది. మరోవైపు ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లతో BJP కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఫలితాలు, ఆ తర్వాతి పరిణామాలపై రెండు పార్టీలూ చర్చిస్తున్నట్టు తెలిసింది.
News February 7, 2025
మెదక్: సగం కాలిన తల, అస్థిపంజరం.. దర్యాప్తు ముమ్మరం
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో బయటపడ్డ<<15380073>> అస్థిపంజరం<<>> పోలీసులకు సవాల్గా మారింది. వ్యక్తిని ఎక్కడో చంపి ఇక్కడ తగలబెట్టినట్లు తెలుస్తోంది. సగం కాలిన తల, అస్థిపంజరం వద్ద జాకీ డ్రాయర్ ఉండటంతో యువకుడని స్పష్టమవుతోంది. సుమారు 20 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన హవేలిఘనపూర్ పోలీసులు.. మృతుడి వివరాలు కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News February 7, 2025
మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!
ఫైళ్ల క్లియరెన్స్పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.