News January 28, 2025
వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా మహేశ్ బాబు

వికారాబాద్ జిల్లా ఉత్తమ ఎంపీడీవోగా దోమ మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న మహేశ్ బాబుకు ఉత్తమ అవార్డు లభించింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహించడం, సేవా దృక్పథం, ఉద్యోగుల సహకారం వల్లే తనకు అవార్డు లభించిందని అన్నారు. అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.
Similar News
News March 15, 2025
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.
News March 15, 2025
పాక్కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

పాకిస్థాన్కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.
News March 15, 2025
VKB: నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 176 ఉన్నత,18 కేజీబివి, మోడల్ 9, యూపీఎస్లు114, ప్రాథమిక 770 పాఠశాలలు ఉండగా అందులో 1,22,556 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు.