News March 10, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

✓ VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
✓ VKB: జిల్లావ్యాప్తంగా 116 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు గైర్హాజరు
✓ పరిగి: ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల పంపిణీ: MLA
✓ పరిగి: ఘనంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
✓ కొడంగల్: వీరభద్రేశ్వర స్వామి విగ్రహ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమం
✓ తాండూర్: జిల్లాలో సావిత్రిబాయిఫూలే వర్ధంతి
✓ బొంరాస్పేట: ఇసుక డంపులు సీజ్
Similar News
News March 11, 2025
భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్ను వినియోగించుకోవాలని కోరారు.
News March 11, 2025
భద్రాచలం: పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇద్దరికి రిమాండ్

భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ ఛాంబర్ ఎదుట ఈనెల 4న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర వ్యక్తులను ఆరా తీయడం ద్వారా పట్టణానికి చెందిన భాను, నరేశ్లే ఈ చర్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News March 11, 2025
విజయవంతంగా ముగిసిన LRS అవగాహన సెమినార్

ఖమ్మం జిల్లాలో LRSపై ఏర్పాటు చేసిన అవగాహన సెమినార్ విజయవంతంగా ముగిసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు తెలిపారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో LRSపై అవగాహన సెమినార్ను నిర్వహించారు. LRSపై సభ్యులు అడిగిన వివిధ సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశామని చెప్పారు. LRSకు సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచే సినట్లు జిల్లా రిజిస్ట్రార్ పేర్కొన్నారు.