News February 25, 2025
వికారాబాద్ జిల్లా.. సోమవారం నాటి ముఖ్యాంశాలు

√ వికారాబాద్: ప్రజావాణికి 109 ఫిర్యాదులు. √ పోలేపల్లి ఎల్లమ్మ, అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్. √ పారిశ్రామిక వాడ కోసం 93 ఎకరాల భూమి సేకరణ.. 62 మంది రైతులకు చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్.√ కొడంగల్: చికెన్, కోడిగుడ్లు ఉచిత మేళాకు బారులు తీరిన జనం.√ 19వ విడత పీఎం కిషన్ నిధులు రైతు ఖాతాల్లో జమ.√ మర్పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు.
Similar News
News February 18, 2026
వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
News February 18, 2026
T20 WC: పాక్ ఓడితే ఇంటికే!

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు సౌతాఫ్రికా-UAE, 3PMకు పాకిస్థాన్-నమీబియా, 7PMకు ఇండియా- నెదర్లాండ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్లో పాక్ గెలిస్తే S-8కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా USAకు అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, జింబాబ్వే S-8కు వెళ్లాయి.
News February 18, 2026
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వేళాయే

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరుకళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.


