News March 5, 2025
వికారాబాద్: నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,914 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు మోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలన్నారు.
Similar News
News October 24, 2025
ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.
News October 24, 2025
వర్గల్: సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలి: గవర్నర్

విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభివృద్ధి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం, కావేరి సీడ్ కంపెనీని సందర్శించి ప్రభుత్వం విద్య రంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి గవర్నర్ తెలిపారు. కావేరి యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్ను పరిశీలించారు.
News October 24, 2025
గాజా డీల్ను బలహీనపరిస్తే నెతన్యాహుపై తీవ్ర చర్యలు!

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.


