News October 13, 2025

వికారాబాద్: పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌లు

image

VKB జిల్లాలో 707 ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణకు 7 టీంలను ఏర్పాటు చేయనున్నారు. PS HM నోడల్ ఆఫీసర్‌గా, ఇద్దరు SGT టీచర్లు మెంబర్లుగా ఉంటారు. 115 UPSలకు ఒక టీం ఏర్పాటు కానుంది. ఇందులో SA నోడల్ ఆఫీసర్‌గా, ఒక PS HM, ఒక SGT ఉంటారు. 176 హై స్కూల్స్ పర్యవేక్షణకు ఒక GHMతో పాటు ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, PDతో కూడిన 4 టీంలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ ఉత్తర్వులు జారిచేశారు.

Similar News

News October 13, 2025

ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు

image

TG: జిన్నింగ్ మిల్లుల్లో జాబ్ వర్క్ టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు CCI ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ పత్తి క్లీనింగ్ ధరలపై సంప్రదింపులు పూర్తయ్యాక మిల్లర్లతో CCI ఒప్పందం చేసుకోనుంది. టెండర్లు ఆమోదించాక మిల్లర్ల వివరాలు జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. తర్వాత ఆ మిల్లులను పత్తి కొనుగోళ్లు కేంద్రాలుగా నోటిఫై చేస్తారు.

News October 13, 2025

వనపర్తి: రమణీయతకు ఆలవాలం.. తిరుమలనాథున్ని క్షేత్రం..!

image

వనపర్తిలోని చిట్టడవిలో కొలువైన తిరుమలనాథుడి క్షేత్రం రమణీయతకు ఆలవాలంగా మారింది. తిరుమలయ్య గుట్ట చుట్టూ కొండలు, లోతైన లోయలు, పచ్చని పరిసరాలు, దట్టమైన చెట్ల పొదలు, పచ్చదనంతో కళకళలాడే సుందర దృశ్యాలు, పక్షుల కిలకిలరావాలు, ఎలుగు బంట్లకు నివాసాలుగా మారిన రాళ్ల గుహలు, స్వామివారి సన్నిధి నుండి తిలకిస్తే కొండచిలువలా వంపులు తిరిగిన రహదారి, రాళ్లపై జాలువారే నీటి ప్రవాహాలు చూపరులను చాలా ఆకట్టుకుంటాయి.

News October 13, 2025

నేడు విద్యుత్ ఉద్యోగ జేఏసీతో ట్రాన్స్‌కో చర్చలు

image

AP: సమస్యల పరిష్కారానికి ఈ నెల 15నుంచి సమ్మె చేపడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి చర్చకు సోమవారం రావాలని పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి ట్రాన్స్‌కో లేఖ రాసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొంది. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సంస్థలు సజావుగా సాగేలా చూడాలని ఉద్యోగులను కోరింది.