News April 9, 2025

వికారాబాద్ మార్కెట్ కమిటీకి రూ.4.87 కోట్లు

image

వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2024-25 ఏడాదిలో రూ.4.87 కోట్ల మార్కెట్ ఫీజ్ వచ్చిందని వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసి యుద్దీన్ తెలిపారు. ఇందులో వికారాబాద్ జిల్లాలో తాండూర్ మార్కెట్ కమిటీ ప్రథమ స్థానంలో నిలువగా.. వికారాబాద్ మార్కెట్ కమిటీ 2వ స్థానంలో నిలిచింది. దాదాపు రూ.500 కోట్ల వ్యాపారం జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News April 17, 2025

21 నుంచి MBA ఇంటర్నల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.

News April 17, 2025

వనపర్తి: హక్కులను కాపాడుకోవాలి: పి.జయలక్ష్మి

image

మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి కోరారు. సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.రాజు అధ్యక్షతన గురువారం వనపర్తిలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!