News December 12, 2025

వికారాబాద్: ముగిసిన రెండో విడత ప్రచారాలు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారాలు ఈరోజు సాయంత్రం 5 గంటలతో నిలిపి వేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ఆయన ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు.

Similar News

News December 14, 2025

ఉగ్రవాదాన్ని సహించబోం.. సిడ్నీ అటాక్‌పై మోదీ

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో జరిగిన <<18561798>>కాల్పుల<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజంపై చేసే పోరాటానికి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాగా కాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు. ఓ దుండగుడు హతమవ్వగా, పట్టుబడిన వ్యక్తి నవీద్ అక్రమ్‌గా గుర్తించారు.

News December 14, 2025

టాస్‌తో వరించిన విజయం.. అడవి లింగాల సర్పంచ్‌గా మంగలి సంతోష్

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన మంగలి సంతోశ్ కుమార్, పెంట మానయ్యాకు 483 ఓట్లు సమానంగా వచ్చాయి. టాస్ వేయడంతో మంగలి సంతోష్ కుమార్ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో గ్రామస్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

News December 14, 2025

రాయికోడ్: 4 ఓట్లతో WIN

image

రాయికోడ్ మండలంలో ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా BRS బలపరిచిని అభ్యర్థి బేగరి ఈశ్వరమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మానమ్మా మీద 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.