News October 7, 2025
వికారాబాద్: మైనార్టీలకు కాంగ్రెస్లో సముచిత స్థానం లేదు: మాజీ ఎమ్మెల్యే

మైనార్టీలకు కాంగ్రెస్లో సముచిత స్థానం లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఎన్నెపల్లిలోని BRS భవన్లో పార్టీ పట్టణ మైనారిటీ నాయకులతో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News October 7, 2025
హైదరాబాద్లో భారీ వర్షం

మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, హిమాయత్నగర్, బర్కత్పురా, నల్లకుంట, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. అటు యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, MBNR, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, RR, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ఏరియాలో వాన పడుతోందా?
News October 7, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.
News October 7, 2025
కోదాడ: రూ.60 లక్షల గంజాయి స్వాధీనం

కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన క్వింటా 20 కేజీల గంజాయిని కోదాడ సీసీఎస్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం, వినియోగం నేరమని, NDPS చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.