News September 5, 2025
వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వాసులకు గుడ్ న్యూస్

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నారు. చిలుకూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు 18-40 సంవత్సరాలు ఉండాలన్నారు. 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఆసక్తిగల మహిళలు 8500165190 నంబర్లో సంప్రదించవచ్చని మహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
Similar News
News September 7, 2025
HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ కార్మికురాలి మృతి

బషీర్బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్ గజానంద్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
News September 7, 2025
HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ కార్మికురాలి మృతి

బషీర్బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్ గజానంద్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
News September 7, 2025
వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్యకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తూ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.