News September 10, 2025
వికారాబాద్: లోక్ అదాలత్తో సత్వర న్యాయం: ఎస్పీ

కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, పోరాడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ కుదుర్చుకుంటే ఇద్దరూ గెలుస్తారని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News April 13, 2026
కంగ్టి గిరిజన గురుకులంలో 100% ఉత్తీర్ణత

కంగ్టిలోని గిరిజన రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 17 మంది, ద్వితీయ సంవత్సరంలో 20 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందరూ పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విజయ్ తెలిపారు. సెకండియర్లో బేగరి ఈశ్వర్ 928 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు.
News April 13, 2026
హైదరాబాద్: 12 గంటల్లోపే వాటర్ ట్యాంకర్ డెలివరీ

ట్యాంకర్ బుకింగ్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. మణికొండ, బంజారాహిల్స్, హఫీజ్పేట్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, రాత్రి వేళల్లో కూడా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని జూమ్ సమావేశంలో అధికారులకు MD సూచించారు.
News April 13, 2026
పతనమైన ఉల్లి ధరలు.. రైతుల కన్నీరు

కొత్తపల్లి మండల పరిధిలో ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర క్వింటా రూ.300కి పడిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పంట కోతకు పెట్టే ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోసిన ఉల్లిని అమ్మేందుకు మార్కెట్లో సరైన ధర లేక పెట్టుబడులు కూడా వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


