News February 23, 2025

విచారణను వేగవంతం చేయాలి: లక్ష్మీ నరసింహరావు

image

బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహ రావు అన్నారు. శనివారం ఘనపురంలో మీడియాతో మాట్లాడారు. రాజలింగమూర్తి హత్య విషయంలో రాజకీయ రాద్దాంతం చేయడం సరికాదని, హత్యకు కారకులైన వారిని పట్టుకొని శిక్షించాలని, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News July 9, 2025

సిద్దిపేట: డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి: సీపీ

image

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా రాజేశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధను కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ ఆయనను అభినందించి, శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.

News July 9, 2025

కరీంనగర్: ‘తక్షణమే హార్డ్ కాపీలు పంపాలి’

image

కరీంనంగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల e-pass లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు తాజా, పునరుద్ధరణ ఉపకారవేతన దరఖాస్తులను (Fresh/Renewal Scholarship Applications) తక్షణమే వెరిఫై చేయాలని DTDO సంగీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి హార్డ్ కాపీలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించలన్నారు. సందేహాల నివృత్తికి 9502664044కు కాల్ చేయాలని కోరారు.

News July 9, 2025

ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్‌ వెళితే గేట్లకు సీల్

image

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.