News August 20, 2025
విజయనగరంలో గంజాయితో ఇద్దరు అరెస్టు

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్ గంట, అంతరామి మల్లిక్ను విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా 10 కేజీల గంజాయితో పట్టుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అనంతరం గంజాయి సీజ్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
Similar News
News August 20, 2025
NZB: ఈ రెండు సీజన్లకు ఢోకా లేనట్లే..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. SRSP, నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసంగి సీజన్కు సైతం సాగు నీరుతో పాటు తాగునీరు అందుతుందని రైతులు పేర్కొంటున్నారు. 3 లక్షల ఎకరాల పైనే పంటలు సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు.
News August 20, 2025
NLG: వివాదాల సుడిగుండంలో పంచాయతీ కార్యదర్శులు..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో <<17460094>>పంచాయతీ కార్యదర్శుల<<>> వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే కొంతమంది కార్యదర్శులు విధులకు హాజరుకాకుండానే ఫేక్ అటెండెన్స్ వివాదంలో ఇరుక్కున్నారు. మరోవైపు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తుండడం దుమారం రేపుతుంది. ఇప్పటికే జాన్ పహాడ్ పంచాయతీ కార్యదర్శిని SRPT కలెక్టర్ సస్పెండ్ చేశారు. వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
News August 20, 2025
HYD: కేబుల్ వైర్లు తెగాయి.. సేవలు నిలిచాయి

రామంతపూర్, అంబర్పేట్ విద్యుత్ ప్రమాదాలతో విద్యుత్శాఖ చేపట్టిన చర్యలతో నగర వ్యాప్తంగా కేబుల్ వైర్లు ఎక్కికక్కడ కట్ అవుతున్నాయి. దీంతో వైర్ల ద్వారా నడిచే ప్రసారాలు నిలిచిపోయాయి. అత్యవసరం ఉన్నవారి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు మేడ్చల్ వాసి కర్కి రమేశ్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాక కేబుల్ వైర్ల తొలగింపు చేపట్టాలని కోరారు. సిబ్బంది వాహనాల్లో భారీగా తొలగించిన కేబుల్ వైర్లను తరలిస్తున్నారు.